టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన కంత్రి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. అయితే తొలి సినిమాతోనే భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న మెహర్ రమేష్ ఆ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన బిల్లా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ పై ఎన్టీఆర్ తో మరొకసారి ఆయన తీసిన శక్తి సినిమా పరాజయం, దాని అనంతరం విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించిన షాడో సినిమా కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక ఆ తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెహర్ రమేష్ ఎట్టకేలకు అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వీరం అనే తమిళ సినిమా రీమేక్ ని తెలుగులో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు మార్పులు చేర్పులు చేసే సిద్ధం చేసిన దర్శకుడు మెహర్ రమేష్ ఎలాగైనా సరే దీనితో భారీ హిట్ కొట్టి మళ్ళీ మంచి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడట. మొదటి నుండి మెహర్ రమేష్ దర్శకత్వ ప్రతిభ పై తనకు నమ్మకం ఉందని అయితే అతనికి సరైన కథ దొరకాలే గాని అతని కెరీర్ చాలా వరకు టర్న్ అవుతుందని మెగాస్టార్ అన్నట్లు సమాచారం. అందుకే అతనికి వీరం సినిమా రీమేక్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

ఇకపోతే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయనున్నాడట మెహర్ రమేష్. ఇప్పటికే దానికి సంబంధించి కథ కూడా సిద్ధం చేసుకున్న రమేష్ అతి త్వరలో దానిని సూపర్ స్టార్ కి వినిపించనున్నాడని అన్నీ అనుకున్నట్లు జరిగితే మహేష్ ఆమోదం అందుకు అందుకున్న అనంతరం వచ్చే ఏడాది చివర్లో దీన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మరో వైపు మహేష్ తో మెహర్ రమేష్ కి మంచి అనుబంధం ఉండటంతో ఆయన కూడా ఈ సినిమా చాలా వరకు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: