తన కెరీర్ పరంగా వరుసగా పరాజయాలతో కొన్నాళ్ళ నుండి సతమతమవుతున్న మాస్ రాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా క్రాక్. యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజాకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుండగా దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.

రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కాగా రేపు విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్ డేట్ రాబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అలానే మరో వైపు దీని తర్వాత యువ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న ఖిలాడీ  సినిమాకు సంబంధించి కూడా రేపు ఒక అప్ డేట్ రానుందని కూడా సమాచారం అందుతోంది.

గతంలో రమేష్ వర్మ తో రవితేజ నటించిన వీర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకోవడంతో ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేసి, తామిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు రమేష్ వర్మ. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా కథను సిద్దం చేశాడట దర్శకుడు రమేష్ వర్మ. మరి రేపు దసరా పండుగ సందర్భంగా అటు క్రాక్ తో పాటు ఇటు ఖిలాడీ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్ డేట్లు రానున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటల వరకూ రవితేజ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: