టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఇటీవల అమితాబచ్చన్ హీరోగా హిందీలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న కోర్టు డ్రామా సినిమా పింక్ కు అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తుండగా ఆయనకు ఆపోజిట్ గా వాదించే లాయర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, శ్రుతిహాసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోపాటు మగువ మగువ అనే సాంగ్ కూడా యూట్యూబ్లో రిలీజ్ అయి ప్రేక్షకులు అలానే పవర్ స్టార్ అభిమానుల నుండి మంచి స్పందన రాబట్టడం జరిగింది.

దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ అందిస్తుండగా వేణు శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రేపు దసరా పండుగ రాబోతోంది అంటూ కొద్ది రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా యూనిట్ నుండి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు.

దానితో పవర్ స్టార్ ఫాన్స్ కొంత ఆవేదనతో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో యూనిట్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు డైరెక్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ అభిమానులకు ఈ పండుగనాడు మంచి శుభవార్త అందించాలని వారు కోరుతూ మెసేజెస్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు పవర్ స్టార్ ముందుకు వచ్చి వారి కోరిక తీరుస్తారా లేదా అనేది తెలియాలంటే మరొక రోజు వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: