సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ఈమధ్య తెలుగులో కొద్దిగా వెనకపడినట్టు అనిపించినా అమ్మడు మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటుంది. తెలుగులో ఆమె క్రేజ్ తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుంది అమ్మడు. ప్రస్తుతం తెలుగులో నితిన్ తో చెక్, క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుంది రకుల్. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు టాక్.

వైష్ణవ్ తేజ్ సినిమా కోసం రకుల్ బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. క్రిష్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయినందుకు షాక్ అవుతుంది రకుల్. డ్రీం టీం తో డ్రీం రోల్ అంటూ రకుల్ క్రిష్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంది. అద్భుతమైన టీం తో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందని అంటుంది రకుల్.

సినిమా షూటింగ్ టైం లోనే రకుల్ డ్రగ్స్ కేసు విచారణకై ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఫైనల్ గా రకుల్ వైష్ణవ్ తేజ్ సినిమా పూర్తి చేసుకుంది. ఒక పాట మినగా సినిమా పూర్తి చేశాడట క్రిష్. తను ఎంచుకున్న కథను అనుకున్న టైం లో పూర్తి చేయడంలో క్రిష్ ఎప్పుడు ముందుంటాడు. కోవిడ్ టైం లో కూడా అనుకున్న టైం లో సినిమాను పూర్తి చేయడం అంటే మాములు విషయం కాదు.

వైష్ణవ్ తేజ్ రెండో సినిమానే అయినా రకుల్ తన పాత్ర బాగుందని ఈ సినిమాను ఒప్పుకుంది. ఈ సినిమాతో అమ్మడి కెరియర్ మళ్లీ సెట్ రైట్ అవుతుందని ఆశిస్తుంది.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: