బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య సినిమాల
కన్నా కూడా విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇటీవల
డ్రగ్స్ వ్యవహారం ఎక్కువగా వినపడుతుంది.
సుశాంత్ సూసైడ్ తో
బాలీవుడ్ లో
డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో చాలా మందికి
సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది పూర్థవ్వకుండానే డైరెక్టర్ల చేతిలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అది ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇవి సరిపోలేదంటు ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.
తాజాగా
హీరోయిన్ హీరోయిన్ లువియానా లోధ్
మహేష్ భట్పై సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఆయన అసలు మనిషి ఇలా ఉంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇండ్ట్రీలోని వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె
మహేష్ భట్ సమీప బంధువైన
సుమిత్ సభర్వాల్ను వివాహాం చేసుకుందని వెల్లడించింది.. అయితే అతను
డ్రగ్స్ పాటు,
ఇండస్ట్రీ లోని పెద్దలకు అమ్మాయిలను సప్లై చేసేవాడని తెలిసి దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీకి
మహేష్ పెద్ద డాన్.. చాలా మంది జీవితాలు ఈయన చేతుల్లో నలిగి పోయాయని వెల్లడించింది.
ఆయన చెప్తే ఏదైనా నిమిషాల్లో పూర్తి అవుతుందని, ఇప్పుడు తనని కూడా నీడా తోడు లేకుండా చేద్దామని అనుకుంటున్నారని అవేదన వ్యక్తం చేసింది.ఇలాంటి సమయంలో నేను దైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంలో తనకు తన కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద కలిగితే అందుకు కారణం వీరిద్దరే అవుతారని చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఆరోపణలు నమ్మ సఖ్యంగా లేవంటూ
మహేష్ తరపు
న్యాయవాది తీవ్రంగా ఖండించారు. దీంతో
బాలీవుడ్ జనాలలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది.. మరి ఈ విషయం ఎంత వరకు వెళుతుందో చూడాలి..