ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. వెండితెరపై తన హీరోలను బోయపాటి ఎలా ఎలివేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడా హీరోలు, భారీ బడ్జెట్ లతో సినిమాలు తీసే ఈ డైరెక్టర్ క్రేజ్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ‘వినయ విధేయ రామ’ ప్లాప్ ఎఫెక్ట్ బోయపాటిపై బాగా పడింది. ఆయనతో సినిమా అంటే హీరోలు భయపడుతున్నారు. దీంతో తన సత్తాను మరోసారి చాటి పూర్వవైభవం పొందాలనుకుంటున్నాడు బోయపాటి. ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.


ఇదిలా ఉండగా.. బోయపాటి, చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందనే వార్తలు వచ్చాయి. ‘సైరా’ సినిమా తరువాత చిరు.. బోయపాటితో సినిమా చేస్తాడనుకున్నారు. కానీ పరిస్థితులు బాలేకపోవడంతో.. ట్రాక్ రికార్డ్ బాగున్న కొరటాల శివతో చిరు సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత తను చేయబోయే ప్రాజెక్ట్ లలో బోయపాటి పేరు వినిపించలేదు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా పక్కా అని అంటున్నారు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుందని టాక్. ఇదివరకే బోయపాటి చిరుకి ఓ లైన్ వినిపించాడు. ఇప్పుడు అదే లైన్ పై వర్క్ చేస్తున్నాడట.


బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటే సెట్స్ పైకి వెళ్లిపోవచ్చనేది బోయపాటి ఆలోచన. చిరు ‘ఆచార్య’ సినిమా తరువాత.. వినాయక్ తో ‘లూసిఫర్’ రీమేక్ చేస్తాడు. ఆ తరువాత బోయపాటి సినిమాను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. నిజానికి చిరు అనౌన్స్ చేసినట్లుగా మెహర్ రమేష్ తో ‘వేదాళం’ రీమేక్ చేయడం లేదట. కొన్ని కారణాల వలన మెహర్ రమేష్ తో సినిమా ఉంటుందని చెప్పారే కానీ సినిమా చేసే ఆలోచన లేదని సమాచారం. అందుకే మెహర్ కి బదులుగా బోయపాటితో సినిమా చేయాలని చిరు భావిస్తున్నారట.  ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!!



మరింత సమాచారం తెలుసుకోండి: