టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ చైర్ ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని చెప్పొచ్చు.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ కావడంతో మీకు టాప్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగా ఆమెకు నాభ నటేష్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ ల రూపంలో ప్రమాదం పొంచి ఉంది..

ఇక ఆమె ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నేయీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ కొట్టింది.. భీష్మ కూడా హిట్ అయ్యి తనకు మంచి పేరు రావడంతో ఆమెకు మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది..తాజాగా శర్వానంద్ చేయబోయే సినిమా కి రష్మిక ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట..ప్రస్తుతం శ్రీకారం పూర్తి చేసే పనుల్లో ఉన్న శర్వానంద్ తర్వాత మహాసముద్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటిస్తున్న ఈ సినిమాకు ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ను చేయబోతున్నాడు శర్వా.. గతంలోనే ఈ సినిమా ను వెంకటేష్ చేయాల్సి ఉండగా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.. కానీ కిషోర్ శర్వానంద్ ని ఒప్పించి ఈ సినిమా ని తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు..  ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా నిరాశపరచడంతో రెడ్ పైనే కిషోర్ ఆశలు పెట్టుకున్నాడు.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే శర్వా తో సినిమా ని మొదలుపెడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఇది కావాల్సిన హిట్.. ఇక రష్మీకి ఫుల్ హిట్ జోష్ లో ఉన్న నేపథ్యంలో మీడియం రేంజ్ హీరో తో సినెమా చేయడానికి ఒప్పుకుంటుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: