దర్శకుడు క్రిష్ ప్రస్తుతం వైష్ణవ తేజ్ హీరో గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక.. ఉప్పెన సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమా ని చడీ చప్పుడు లేకుండా తెరకెక్కించాడు క్రిష్.. పవన్ కళ్యాణ్ సినిమా కి టైం ఉండడంతో ఈ సినిమా ని తెరకెక్కించాడని అంటున్నారు.. ఇక లాక్ కారణంగా ఉప్పెన సినిమా రిలీజ్ కాలేదు..ఉప్పెన సినిమాని థియేటర్లలోనే ఓపెన్ చేయాలనీ అనుకోవడంతో, దానికి ఇంకా టైం ఉండడంతో వైష్ణవ తేజ్ ఈ సినిమా ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది..

క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ తో ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు.. అయితే వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ రావడానికి ఆలస్యమవుతుండడంతో పవన్ వచ్చే గ్యాప్ లో ఈ సినిమా చేయొచ్చని క్రిష్ భావించాడు.. అయితే అనుకున్నట్లు గానే చాలా తక్కువ టైం లో వైష్ణవ తేజ్ సినిమా ని పూర్తి చేశాడు క్రిష్..  చిత్రం కోసం కేవలం ముప్పయ్‍ అయిదు రోజుల వర్కింగ్‍ డేస్‍ పెట్టుకున్నారు. అంత త్వరగా చిత్రీకరించడం, అది కూడా కరోనా కోరలు చాస్తోన్న సమయంలో పూర్తి చేయడం జరిగేది కాదని భావించారు. కానీ క్రిష్‍ అనుకున్నట్టుగా ముప్పయ్‍ అయిదు రోజుల్లో షూటింగ్‍ పనులు పూర్తి చేసేసాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్‍, గ్రాఫిక్స్ పనులు మాత్రం బ్యాలెన్స్ వున్నాయి

అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి భారీ బడ్జెట్ సినిమాలనే క్రిష్ తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ కి సింపుల్ కథ తో తక్కువ రోజుల్లో పూర్తి చేయడం పెద్ద విశేషము కాదని అంటున్నారు.. వేరే దర్శకులయితే కనీసం ఏడాదిన్నర సమయం తీసుకుంటూ వుంటారు. కానీ క్రిష్‍ వర్కింగ్‍ స్టయిల్‍ చాలా డిఫరెంట్‍గా వుంటుంది. ఏమి చేయాలనేది ముందే షాట్‍ టు షాట్‍ ప్లాన్‍ చేసేసుకుని, రోజుకి ఎంత భాగం షూట్‍ చేయాలనేది కూడా ఖచ్చితంగా అనుకుని సెట్స్ మీదకు వెళతాడు.  ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో క్రిష్  ఆ సినిమా ని ఏవిధంగా తెరకెక్కిస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: