ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తున్నది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రభాస్ స్టైలిష్ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవలే ప్రభాస్ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో రికార్డులు కొల్లగొడుతుంది.
బిట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అని ఒక మోషన్ పోస్టర్ ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. మోషన్ పోస్టర్ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ మోషన్ పోస్టర్ కేవలం 24 గంటల వ్యవధిలోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అతి తక్కువ సమయంలో ఇంత లా వ్యూస్ సాధించిన మొదటి మోషన్ పోస్టర్ ఇదే కావడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.