మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రొటీన్ కధ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ భారీగా వచ్చినా ప్రేక్షకుల ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలం అయింది.

అయితే ఈ సినిమా వెండితెర మీద పెద్దగా సత్తా చాటలేకపోయినా బుల్లితెర మీద మాత్రం మొదటి రోజు నుండీ సత్తా చాటుతూనే ఉంది.  ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. ఇప్పటి దాకా ఈ సినిమా 14 సార్లు బుల్లితెరపై టెలికాస్ట్ అయింది. ఇలా టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఈ సినిమాకి మంచి టీఆర్పీని వస్తుండడం విశేషం..

తాజాగా ఈ సినిమాని స్టార్ మా మరో సారి బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు. ఈ సారి కూడా  4.37 టీఆర్పీని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకి వస్తున్న టీఆర్పీని చూసి స్టార్ మా నిర్వాహకులు ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: