మొత్తానికి సంక్రాంతి పండుగకు ఆశలను మళ్ళించుకుంటోంది టాలీవుడ్. కరోనా తరువాత దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమ అని చెప్పాలి. దసరాకు బడా సినిమాలు రిలీజ్ అంటూ ఎంతగా ఊదరగొట్టినా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ఇక సినిమా హాళ్ళు పూర్తిగా తెరచుకోలేదు. దీనికంతంటికీ కారణం కరోనా ఇంకా అలాగే ఉంది. జనాల భయాలు అంతకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో అందరూ మరో రెండున్నర నెలలకు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు.

ఇక సంక్రాంతి విషయానికి వస్తే పెద్ద లిస్ట్ ఇప్పటిదాకా వినిపించింది. కానీ ఇప్పటిదాకా అఫీషియల్ గా సినిమాలు రిలీజ్ చేయడానికి మాత్రం ముగ్గురు ఫిల్మ్ మేకర్స్ రెడీ అయ్యారు. ఆ మూడు సినిమాలు కూడా బాగా హోప్ పెట్టుకున్నవే. మాస్ మహారాజా రవితేజా మూవీ క్రాక్ సంక్రాంతికి వస్తోందిట. ఈ మూవీకి  గోపి మలినేని డైరెక్టర్ గా ఉన్నారు.  శ్రుతిహాసన్ హీరోయిన్. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని డిజైన్ చేశారు.

ఇక మరో మూవీగా అక్కినేని వారి వారసుడు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ వస్తోంది. ఈ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో లో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణం కొత్త ఆకర్షణ. మొత్తానికి ఈ మూవీ కూడా అన్ని డేట్లూ దాటుకుని సంక్రాంతి వద్ద లాండ్ అవుతోందిట.


ఇంకో వైపు స్రవంతి మూవీస్ బ్యానర్ మీద రామ్  పోతినేని హీరోగా వస్తున్న  మూవీ రెడ్. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. స్రవంతి కిషోర్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీని ఎక్కువ రేటుకు  ఓటీటీకి అడిగినా కూడా ఇవ్వకుండా థియేటర్లలోనే  రిలీజ్ కే ఉంచారు. దాంతో ఈ మూవీ కన్ ఫర్మ్ అంటున్నారు. ఇవి కాకుండా వకీల్ సాబ్ మూవీ రావాలి. వస్తుంది అని అంటున్నా ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం లేదు. దాంతో పాటు  మరో నాలుగైదు సినిమాలు కూడా వస్తాయని అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: