దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటీమణి గా పేరొందిన సమంత అక్కినేని తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సమంత అక్కినేని గార్డెనింగ్ వంటి పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని అభిమానులు బాగా అలరించారు. లాక్ డౌన్ లో తాను ఎలా కాలక్షేపం చేశారో మొత్తం నెట్టింట ఫోటోలు, వీడియోలు షేర్ చేసి తెలిపారు. ఆమె నిత్యం సోషల్ మీడియా వేదికగా కాలం గడుపుతూ ఉండటం తో ఆటోమేటిక్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.


దీంతో ఆమె అభిమానుల పై ప్రముఖ కంపెనీల కన్ను పడింది. అందుకే ఆమెకు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ తమ కంపెనీల ను ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఆమె మింత్రా, ఏరియల్ సర్ఫ్ వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ కంపెనీలను ప్రమోట్ చేస్తున్నారు. టీవీ ప్రకటనల షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షో నుండి కూడా కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఆమె సినిమాల్లో నటించకపోయినా రెండు చేతులా సంపాదిస్తుంది అని చెప్పుకోవచ్చు.


అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సమానంగా ఆమె కంపెనీల నుండి పారితోషకం అందుకుంటున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సమంత అక్కినేని కోట్ల మంది అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎక్కువగా శ్రమ పడకుండానే బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మరోవైపు అక్కినేని నాగ చైతన్య కూడా సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయలను పారితోషికంగా పుచ్చుకుంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా డబ్బు సంపాదిస్తున్న కపుల్ గా నాగ చైతన్య, సమంత నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: