నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. టాక్సీవాలాతో సత్తా చాటిన రాహుల్ తన నెక్స్ట్ సినిమా నానితో ఫిక్స్ చేసుకున్నాడు. డిఫరెంట్ కథతో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వచ్చినదసరా పోస్టర్ సినిమాపై క్రేజ్ పెంచింది.

దసరా సందర్భంగా రిలీజైన పోస్టర్ లో మీసపుకట్టుతో నాని షాడో లుక్ అదిరిపోయింది. ఈ సినిమా నాని కెరియర్ లో సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వి సినిమాతో నాని కొద్దిగా నిరాశపడ్డాడు. అందుకే తను చేసే సినిమాలపై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శ్యాం సింగ రాయ్ తెరకెక్కనుంది.

టక్ జగదీష్ సినిమా సెట్స్ మీద ఉంది. శ్యాం సింగ రాయ్ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. నాని కెరియర్ లో మొదటిసారి అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు. తప్పకుండా నాని కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంలో చెప్పొచ్చు.                                                                      
 

మరింత సమాచారం తెలుసుకోండి: