ఎవరైనా దురద వేస్తే గోక్కుంటారు. కానీ వర్మ విచిత్రంగా దురద లేకపోయినా గోక్కుంటారు. ఎప్పుడూ వివాదాలతో వీపు గోక్కునే వర్మ ఈసారి కూడా అంతే దురదతో మరో వివాదాస్పద సినిమాని తెరకెక్కించారు. మొన్న పవన్ మీద ఒక మూవీ తీసి సంతృప్తి చెందారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి తనే హీరోగా నటించి, తన మీదే సినిమా తీసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆర్జీవి మిస్సింగ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న వర్మ దీనికి సంబంధించిన ట్రైలర్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశారు. 


ట్రైలర్ స్టార్ట్ అవ్వడంతోనే ఆర్జీవి మిస్సింగ్ అని వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ తర్వాత అర్జీవి ఆఫీస్ లో పని చేసే స్టాఫ్ పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆర్జీవిని వెతికే పనిలో పడతారు. మొదట్లో పబ్లిసిటీ కోసం వర్మ కావాలని చేస్తున్నాడనుకున్నా తర్వాత అదే నిజం అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కిడ్నాప్ చేసి ఉండచ్చునని పోలీసులకి కంప్లైంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకపోతే, మెగా ఫ్యామిలిలో ఎవరో సుపారీ ఇచ్చి చేయించి ఉంటారని అంటారు. మెగాస్టార్ అయినా సరే వదిలిపెట్టం అంటూ వర్మ ఫ్యాన్స్ హెచ్చరిస్తారు. బాలకృష్ణను సైతం వర్మ వదల్లేదు. “వాడికిది జరగాల్సిందే. కిడ్నాప్ చేసి మంచి పని చేశారు. లేకపోతే నా మీద పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తాడా వాడు” అని బాలకృష్ణ కేరెక్టర్ మాట్లాడుతుంది. 


రాజకీయనాయకులని కూడా వదల్లేదు. కేసీఆర్, చంద్రబాబు, కెఏ పాల్ ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. వర్మ మిస్సింగ్ కేసుని సిన్సియర్ ఆఫీసర్ గజినీకాంత్ టేకప్ చేస్తారు. గజినీకాంత్ అంటే రజినీకాంత్ లా నటించారు. ఇక వర్మ ఈ మూవీలో ఆయా పాత్రల కోసం అచ్చం అలానే ఉండే వాళ్ళని పెట్టారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇలా వాళ్ళ పోలికలతో ఉన్న వాళ్ళను పెట్టి సినిమా తీశారు. ట్రైలర్ లాస్ట్ లో చిరంజీవి, పవన్ లు పరారీలో ఉన్నట్టు, త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు వర్మ.


మరీ దారుణంగా మెగా ఫ్యామిలిని టార్గెట్ చేశారని వర్మ మీద ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక, మంచితనాన్ని చేతకానితనంగా భావించి, పవన్ కళ్యాణ్ ను రాజకీయాలకు దూరం చేయాలనే దురుద్దేశంతో వర్మ ఇలా సినిమాలు తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారని అంటున్నారు. కానీ నిజానికి సీరియస్ గా తీసుకునేంత సీన్ ఈ సినిమాకి లేదన్నది ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇదొక కామెడీ మూవీ అని, మన హీరోలు పిచ్చ లైట్ తీసుకుంటారని స్పష్టంగా అర్ధమవుతుంది. 


మరి సినిమాలో వర్మ మిస్సింగ్ అన్నది నిజంగా ఉంటుందా? లేక తాను కన్న కలగా చూపిస్తారా? అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ మూవీని త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఏది ఏమైనా గాని వివాదాలతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు వర్మ. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: