తెలుగులో ఒకరకంగా అరుంధతి సినిమా తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి అనుష్క కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అయితే చేసే సినిమాల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించే ఈమె. బాహుబలి తర్వాత చాలా ఆలోచించి భాగమతి చేసి హిట్ కొట్టింది. ఆ తరువాత మరో సినిమాని ఆమె నమ్మి చేయడానికి ఏకంగా రెండేళ్లు పట్టింది. అలా ఆమె చాలా నమ్మి చేసిన సినిమా నిశ్శబ్దం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సంగతి తెల్సిందే.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన ఈ సినిమాకి మొదట నెగటివ్ టాక్ రాగా కాలం గడిచిన కొద్దీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అనుష్కనా ? లేక అంజలినా అనే అనుమానాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది కూడా. అయితే ఈ నిశ్శబ్దంతో అనుష్క కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అని కొంత ప్రచారం జరిగింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందే ఈమె సినిమాలు ఏవీ ఒప్పుకోక పోవడంతో ఆమె సినిమాలు ఆపెస్తోందని, పెళ్లి కూడా చేసుకోనుందని ప్రచారం జరిగింది.

కానీ ఆమె ఈ విషయాల మీద అయితే ఏమీ స్పందించలేదు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఈ మేరకు దర్శకుడు ఒక ట్విట్టర్ యూజర్ కి రిప్లై ఇచ్చారు. ఈ సినిమా ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అలాంటి సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ విషయం మీద దర్శక నిర్మాతలే క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: