టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా ఉన్న సమంత చేతిలో ఒక్క క్రేజీ ప్రాజెక్ట్‌ కూడా లేదు. అయినా సరే లాక్‌డౌన్‌ టైంలో ఈ అమ్మడి గురించే ఎక్కువ మాట్లాడుకునేలా చేసింది ఈ కేరళ భామ. టెర్రస్‌ మీద వ్యవసాయం అంటూ కొన్నాళ్ళు ఫార్మర్‌ అవతారం ఎత్తింది. తన చేతులతో పండించిన పంట చూసి ఆనందపడిపోయింది. అలానే మరో పక్క యోగాసనాలు వేసుకుంటూ మరో పక్క హాట్ హాట్ జిమ్ ఫోజులతో రచ్చ రేపుతోంది. ఇప్పుడు కాదు కానీ లాక్డౌన్‌ టైంను సమంత ఫుల్‌గా ఎంజాయ్‌ చేసింది. ఇంటిపట్టునే వుంటూ.. వంటలు.. వ్యవసాయంతో టైం తెలీయకుండా ఆరు నెలలు గడిపేసింది.

తన ప్రతి దాన్నీ ఫొటోలు ట్వీట్స్‌ రూపంలో అభిమానులతో పంచుకుంటూనే వుంది. టైం దొరికినప్పుడల్లా.. ట్విట్టర్‌లో "ఆస్క్‌ సామ్‌ సెషన్‌' అరేంజ్ చేసి మరీ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఈమె రెండు సినిమాలు ఒప్పుకుందని అంటున్నా దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. ఈమె లెక్కలో అధికారికంగా ఉన్న కంటెంట్ ఏదయినా ఉందా ? అంటే అది ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. ఈ సిరీస్ ఒక్కదాని మీదే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది.

అందుకే ఈ సిరీస్ డబ్బింగ్ మొదలు ప్రతి అంశంలో దీనిని ప్రమోట్ చేయడానికే ఆమె చూస్తోంది. ఆ మధు చివరి సారిగా ఎప్పుడు ఏడ్చారని ఓ నెటిజన్ అడిన ప్రశ్నకు కూడా సామ్‌ '''ది ఫ్యామిలీ మ్యాన్' రషెస్ చూసినప్పుడు ఏడ్చానని చెప్పింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 14 అంటే దీపావళి నుండి స్టీమింగ్‌ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సిరీస్‌ తోనే సమంత డిజిటల్‌ వరల్డ్‌ లోకి అడుగు పెడుతోంది. ఇందులో ఆమె టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఈ హిందీ  సిరీస్ కు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది సమంత. ఒక వేళ ఈ సిరీస్ కనుక దెబ్బ కొడితే ఆమె మళ్ళీ సిరీస్ లలో నటించదని అంటున్నారు. మరి ఈ సిరీస్ ఈమెకు ఎంత పేరు తెచ్చిపెడుతుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: