అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుంది మూవీ యూనిట్. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఒక లిరికల్ సాంగ్ ప్రేక్షక అభిమానుల నుండి మంచి స్పందన రబట్టడం జరిగింది.  

ఇకపోతే దీని తర్వాత నాగచైతన్య నటించనున్న సినిమా థాంక్యూ. ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి గత కొద్ది నెలలుగా వార్తలు ప్రచారం అవుతున్న ప్పటికీ అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే నేటి ఉదయం ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరగటం అలానే మూవీ యూనిట్ వాటిని ప్రకటించడం జరిగింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడని అలానే హీరో నాగచైతన్య కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటారని అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది మూవీ యూనిట్.  

వాస్తవానికి గతంలో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తొలిసారిగా హీరోగా పరిచయమయ్యాడు నాగచైతన్య. ఆయన నటించిన తొలి సినిమా జోష్ మంచి అంచనాలతో రిలీజై అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే తన కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం దిల్ రాజు గారి తో చేస్తున్న ఈ థాంక్యూ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నాగచైతన్య కూడా ఎంతో కసిగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు గతంలో విక్రమ్ కుమార్ తో మనం వంటి సక్సెస్ఫుల్ సినిమాలో పనిచేసిన నాగచైతన్య, తప్పకుండా ఆయన ఈ సినిమాని కూడా సక్సెస్ చేస్తారు అని భావిస్తున్నారట. మరి అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరి కొంత  సమయం వరకు వెయిట్ చేయక తప్పదు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: