ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో అనుష్క కూడా ఒకరు అని చెప్పక తప్పదు. తన ఆకట్టుకునే అందం అభినయంతో ఎందరో ప్రేక్షకుల ఎందరో అభిమానుల గుండెల్లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనుష్క  తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న అనుష్కకు కెరీర్లో అరుంధతి సినిమా ఒక్కసారిగా అతి పెద్ద సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్ గా ఆమెకు విపరీతంగా పేరు క్రేజ్ ని తెచ్చి పెట్టడం జరిగింది.

 దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ గ్రాఫికల్ విజువల్ యాక్షన్ సినిమా అప్పట్లో పలు రికార్డ్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో మరింతగా దూసుకెళ్లిన అనుష్క ఇటీవల ఏకంగా దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల విజయాలతో హీరోయిన్ గా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ సినిమాలో ఏ స్థాయిలో భారీ విజయాన్నీ అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక వాటి అనంతరం అనుష్క నటించిన భాగమతి సినిమా మంచి సక్సెస్ సాధించగా ఇటీవల వచ్చిన నిశ్శబ్దం సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి కొద్ది రోజుల క్రితం అనుష్క ఒక స్టార్ దర్శకుడి సినిమాని ఓకే చేశారని గతంలో తాను నటించిన అరుంధతి సినిమా మాదిరిగా ఈ సినిమా కథా కథనాలు కూడా సాగుతాయని, ఈ సినిమా ఒకరకంగా  అరుంధతి సినిమా కి సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ భారీ ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తకు సంబంధించి అసలు వాస్తవాలు తెలియాలంటే పూర్తి న్యూస్ బయటకు వచ్చేదాకా ఆగాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: