దసరా వస్తుంది.. సరదాలు తెస్తుంది. విజయదశమి రోజున తలపెట్టిన పనులకు విజయమే. అందుకే అందరూ ఈ శుభ ముహూర్తాన తమ కొత్త పనులు ప్రారంభిస్తారు. సినీ పరిశ్రమ ఈ విషయంలో ముందు ఉంటుంది. ప్రస్తుతం కరోనా వల్ల సందడి లేదు గానీ.. ఈసరికి కొత్త సినిమాలతో ధియేటర్లు కళకళలాడిపోయేది. అయితే.. సినీ పరిశ్రమలో మాత్రం సందడి నెలకొంది. కొత్త సినిమాలు ప్రారంభం, టైటిల్ అనౌన్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ లతో హడావిడి నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొత్త నిర్మాణ సంస్థ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైంది. ‘సప్త స్వర క్రియేషన్స్’ సంస్థ గ్రాండ్ లాంచ్ అయింది.


గత ఏడేళ్లుగా డిఓపి గా పలు చిత్రాలకు పని చేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్విజయదశమి రోజున నిర్మాతగా మారారు. సప్తస్వర క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘విజయదశమి శుభ సందర్భంగా మా బ్యానర్ ను ప్రారంభించడం సంతోషంగా వుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ కంటెంట్, ప్రేమ కథా చిత్రాలను మా సంస్థలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడాదికి నాలుగు సినిమాలు నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నాం. టాలెంట్ వున్న నటీనటులు, టెక్నీషియన్స్ కు అవకాశం కల్పిస్తాం. మంచి సినిమాలు నిర్మిస్తాం. కొత్త ప్రాజెక్ట్ వివరాలను త్వరలో తెలియ చేస్తాం’ అన్నారు.


పరిశ్రమలో కొత్త నిర్మాణ సంస్థలు రావడం శుభపరిణామం. కొత్త కాన్సెప్టులతో ఎంతో మంది తమ ప్రతిభ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త వచ్చిన నిర్మాణ సంస్థలు కొత్త వారితోనే సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన వారు ఉన్నారు. సప్తస్వర క్రియేషన్స్ కూడా కొత్త వారికి ప్రోత్సాహం ఇస్తే మంచి సినిమాలు, న్యూ టాలెంట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: