గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఎన్నో అంచనాల మధ్య భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రిలీజ్ అనంతరం కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోవడం జరిగింది. దాని తర్వాత మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ మోషన్ పోస్టర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించే ఛాన్స్ ఉందని ఇటీవల చిరంజీవి, కొరటాల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు.

అయితే ఆ పాత్రలో పక్కాగా చరణ్ నటిస్తారా లేదా ఎవరైనా నటిస్తారా అనే విషయం ఇప్పటికీ తేలలేదని మరోవైపు ఆ పాత్రలో అవసరం అయితే తాను నటిస్తాను అంటూ ఇటీవల తనతో మహేష్ బాబు చెప్పారు అంటూ కొరటాల కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ అమెరికాలో చేయాలని భావించిన మహేష్ బాబు అక్కడ పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా రెండు నెలలు వాయిదా వేశారని అందువల్ల ఈ లోపు మెగాస్టార్, కొరటాల ల ఆచార్య లోని ప్రత్యేక పాత్రలో నటించనున్నారని అంటున్నారు. అయితే ఆ పాత్రను మహేష్ చేయడానికి కారణం ఓ వైపు చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉండటమేనని టాక్. అయితే మొత్తంగా ఆ ప్రత్యేక పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనేటువంటి భారాన్ని మాత్రం పూర్తిగా కొరటాల మీదనే వేసారట మెగాస్టార్ చిరంజీవి. మరి చివరగా ఆ ప్రత్యేకపాత్రలో ఎవరు నటిస్తారో కొరటాల ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: