టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. క్రియేటివ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా తొలిసారిగా రష్మిక మందన్న నటిస్తుండగా దీనికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ అతిత్వరలో హైదరాబాదులో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనేటువంటి మాస్ పాత్రలో నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో  పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.  

ఇకపోతే దీనికి ముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా అలవైకుంఠపురములో గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ లెవల్లో నిర్మించిన ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడం తో పాటు ఇందులోని సాంగ్స్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని దక్కించుకున్నాయి. కాగా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మొత్తం మూడు సినిమాలు చేశారు. మొదటగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి మంచి హిట్ కొట్టగా ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ విజయాన్ని, అలానే అలవైకుంఠపురములో భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే.  

అయితే వీరిద్దరి తదుపరి కాంబినేషన్ సినిమా గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొద్ది రోజుల నుండి చర్చ జరుగుతోంది. కాగా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే మరొక మూడు సంవత్సరాల వరకూ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశమే లేదని ఎందుకనగా, త్రివిక్రమ్, తన తదుపరి తన సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అలానే ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో ప్లాన్ చేసారని, వాటి అనంతరం నాచురల్ స్టార్ నాని, యువ హీరో విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవిఎం, రెబల్ స్టార్ ప్రభాస్ లతో కూడా ఆయన సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇవన్నీ పూర్తి కావటానికి మూడేళ్లకు పైగా టైం పడుతుందని, ఇక వాటి అనంతరమే మరొకసారి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేసే చాన్స్ ఉందని అంటున్నారు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: