పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవర్ స్టార్సినిమా పూర్తి కాకుండా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు కన్ఫాం కాగా లేటెస్ట్ గా దసరా రోజున ఓ క్రేజీ సినిమాను ఎనౌన్స్ చేశారు.

సితార ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా వస్తుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. పవర్ స్టార్ తో పాటుగా ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. పృధ్వి రాజ్, బిజూమీనన్ కలిసి నటించిన ఏకే సినిమా తెలుగులో పవన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అంటే మళయాళంలో బిజూ మీనన్ చేసిన ఈ పాత్రను పవన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇక సెకండ్ హీరోగా రానా నటిస్తాడని టాక్. ఈ సినిమాకు త్రివిక్రం స్క్రిప్ట్ వర్క్ చేస్తారని అంటున్నారు. సాగర్ చంద్రకు పవర్ స్టార్ సినిమా ఛాన్స్ అంటే నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సూపర్ హిట్ రీమేక్ సినిమా తెలుగులో కూడా హిట్ అవుతుందని ఫిక్స్ అవుతున్నారు ఆడియెన్స్.                                                                                          


 

మరింత సమాచారం తెలుసుకోండి: