టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కె.కె.సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా ఈ మూవీని దాదాపు రూ.500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అగ్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఎంతో భారీగా నిర్మిస్తున్నారు.  

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని శ్రియా శరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇకపోతే దీని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మించనున్న భారీ సినిమాకు  దర్శకత్వం వహించనున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా విషయమై అధికారికంగా ప్రకటన చేసిన రాజమౌళి, దానిని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే తొలిసారిగా రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్న ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా లో భారీ లెవల్లో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తే బాగుంటుందని పలువురు సూపర్ స్టార్ ఫాన్స్ అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బిజినెస్ మాన్ సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి,మహేష్ బాబు తో ఎటువంటి సినిమా చేయాలి అంటూ ఆయన అభిమానులను ప్రశ్నించగా, రాజమౌళికి ఎక్కువమంది నుండి జేమ్స్ బాండ్ సినిమా కావాలి అనేటువంటి సమాధానం లభించింది. మరి ప్రేక్షకులు అభిమానులు ఈ విధంగా వారిద్దరి కాంబినేషన్లో  భారీ లెవల్లో జేమ్స్ బాండ్ తరహా సినిమాని ఆశిస్తున్నారు సరే, ఇంతకీ రాజమౌళి మనసులో ఆ సినిమా విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు కదా ఆయన ఆ తరహా సినిమానే మహేష్ బాబు తో చేస్తారా లేక మరొక ఏదైనా జానర్లో సినిమా చేస్తారా అనేటువంటివి తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: