చరణ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుందని టాక్. ఇదిలాఉంటే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమా అసలైతే 2021 ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా అనుకున్న టైం కు వస్తుందా అన్నది డౌట్ అని చెప్పొచ్చు. ఇంకా చరణ్ పార్ట్ కు సంబందించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. ఈలోగా షూటింగ్ చేస్తున్న సినిమా యూనిట్స్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది అందుకే ఆచార్య కోసం చిరు కొద్దిగా ఆగమని చెప్పినట్టు తెలుస్తుంది.
2021 సమ్మర్ లో ప్రభాస్ రాధే శ్యాం, పవర్ స్టార్ వకీల్ సాబ్ రిలీజ్ అవనున్నాయి. ఇక చిరు ఆచార్య వస్తే జూలైలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత చిరు వరుసగా మూడు క్రేజీ సినిమాలు లైన్ లో ఉంచాడు. ఆ సినిమాలు తప్పకుండా మెగా ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటాయని టాక్. ఆ సినిమాల ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆచార్య సినిమాను కూడా సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలన్నిటితో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. పక్కా టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్రయూనిట్.