ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి. రాజశేఖర్ ఇటీవల కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ‘మా నాన్నగారి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. దయచేసి ఆయన గురించి ప్రార్ధించండి’ అంటూ ఆయన కూతురు శివాత్మికలేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ టైములో ‘తన స్నేహితుడైన రాజశేఖర్ త్వరలోనే కోలుకుంటారు’ అంటూ చిరు.. శివాత్మిక ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. చిరు ఓ ట్వీట్ వేసి ఊరుకున్నారు అనుకుంటే పొరపాటే.! ఆయన రాజశేఖర్ కోసం ఇంకా చాలా చేశారట.

అందుతోన్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసన రికమండేషన్ తో … అపోలో ఆస్పత్రి వైద్యులను పిలిపించి రాజశేఖర్ కు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారట. దాంతో సీనియర్ వైద్య నిపుణులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి… రాజశేఖర్ త్వరగా కోలుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రస్తుతం రాజశేఖర్ బాగానే ఉన్నారని ఆయన కూతురు శివాత్మిక తెలిపారు. డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కు ఆయన స్పందిస్తున్నారని కూడా ఆమె తెలిపింది.

మరో రెండు రోజుల్లో రాజశేఖర్ నార్మల్ పొజిషన్ కు వచ్చేస్తారని కూడా సమాచారం. అప్పుడప్పుడు చిరు మరియు రాజశేఖర్ల మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం జరిగినప్పటికీ.. ఆ తరువాత వెంటనే కలిసిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చిరు ముందుకు రావడం అభినందించతగ్గ విషయమనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...









మరింత సమాచారం తెలుసుకోండి: