బాలీవుడ్ లో సంచలనంగా మారిన ఘటన డ్రగ్స్.. ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు వల్ల ఇండస్ట్రీలోని ఈ చీకటి కోణం బయటకు వచ్చింది. మొదట రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది. ఆమె చెప్పిన భాగోతం లో డ్రగ్స్ వ్యవహారం కీలకంగా మారింది.. ఈ కేసు విచారణ లో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు సీరియస్ గా చర్చలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వారికి ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్ తో పాటు గా తెలుగులోని కొంతమందికి డ్రగ్స్ తో సంబంధం ఉందని వెల్లడించారు.



తెలుగులో తొలిప్రేమ సినిమాలో నటించిన హీరోయిన్ స్వప్న పబ్బి తాజాగా డ్రగ్స్ రాకెట్‌లో చిక్కుకుంది. ఈ విషయాన్ని క్లుప్తంగా విచారణ చేపట్టిన అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. కానీ ఆమె మాత్రం అధికారులకు చిక్కకుండా ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. దీంతో ఆమె పై అనేక రూమర్స్ బయటకొచ్చాయి. స్వప్న పబ్బి కోసం ఎన్సీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని, అయితే ఎవ్వరికీ దొరకకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని వార్తలు హల్ చల్ చేశాయి.



ఈ విషయం పై స్పందించిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదికగా స్పందించి తదుపరి విచారణను పూర్తి వివరణ ఇచ్చింది. ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే గానీ, అజ్ఞాతం లోకి వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వప్న పబ్బి తీవ్రంగా ఖండించింది. మీడియా లో వస్తున్న వార్తలకు ఖంగుతిన్నానని చెప్పుకొచ్చింది. నిజానికి తాను లండన్‌ లో ఫ్యామిలీతో ఉన్నానని, తన తరుఫున తన లాయర్స్ అధికారుల తో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పింది. ఆధారాలు లేకుండా ఇలా ఆరోపించడం బావ్యం కాదని మీడియా పై భగ్గుమంది. ఈ అమ్మడు ఇంకెంత మంది పేర్లను బయట పెడుతుంది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: