టాలీవుడ్ లో నటసింహ నందమూరి బాలక్రిష్ణ అంటే తెలియని వారుండరు. నందమూరి అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే బాలయ్యకి క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి హిట్ కొట్టాక మరో హిట్ పడ లేదు. ఆ సినిమా తరువాత పూరీతో చేసిన పైసా వసూల్, కేఎస్ రవి కుమార్ తో చేసిన జై సింహా, రూలర్, క్రిష్ తో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ఫ్రాంచైజీ వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన తనకు రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటితో ఒక సినిమా చేస్తున్నాడు.

వీరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమాకు చెందిన చాలా మంది హీరోలు షూట్ లు మళ్ళీ మొదలు పెట్టారు. చిరంజీవి, బాలయ్య లాంటి ఏజ్ ఉన్న హీరోలు తప్ప మిగతా అందరూ మళ్ళీ డైలీ రొటీన్ లో పడ్డారు. అయితే అందరూ షూట్స్ మొదలు పెట్టకముందే రిస్క్ తీసుకోవటానికి ఉత్సాహం చూపిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మాత్రం షూట్ కి రెడీగా లేనని చెబుతున్నాడని అన్నారు. అయితే అదేమీ లేదు. ఈరోజు నుండి ఆయన సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను నవంబర్ 19 దాకా షూట్ చేస్తారని అంటున్నారు. ఆ తరువాత ఈ సినిమాలోని సాంగ్స్ రెగ్యులర్ షూట్ కి వెళ్తున్నట్టు చెబుతున్నారు.  

దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాని 2021 వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్ మీనాని ఒక రోల్ కోసం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత కాగా తమన్ సంగీత స్వరకర్తగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ హీరోయిన్ ప్రగ్యా మార్టిన్ ని నటింప చేస్తున్నారని అంటున్నా అందుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: