సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ లు హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా మొన్నీ మధ్య సెన్సార్ కార్యక్రమాలను కూడా  పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సాయి తేజ్ మొన్ననే ప్రకటించారు. అతి త్వరలో మీ ముందుకు అని హింట్ కూడా ఇచ్చాడు. ఒకానొక టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది కూడా ‘పే పర్ వ్యూ’ ప్రకారం జీ ప్లెక్స్ లో రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది.  

ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అవసరం లేదు. కానీ ఈ చిత్రానికి చేయించారు. కాబట్టి.. ఈ సినిమాని కన్ఫాంగా థియేటర్లలోనే విడుదల చేస్తారని అంటున్నారు. ఈ మధ్యనే థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చనేది విశ్లేషకుల వాదన. అయితే థియేటర్స్‌ తెరుచుకునే అవకాశం ఇచ్చినా ఇప్పటికిప్పుడు ఓపెన్‌ అవుతాయన్న గ్యారెంటీ కూడా లేదు.

థియేటర్స్‌లోనే వస్తామని భీష్మించుకుని కూర్చుకున్న సినిమాలన్నీ ఒట్టును గట్టు మీద పెట్టేస్తూ ఓటీటీ దిశగా అడుగులేస్తున్నాయి. థియేటర్స్‌ ఓపెన్‌ అయినా.. ముందుగా రిలీజ్‌ అయ్యే సినిమాలు చాలా సమస్యలు ఫేస్‌ చేయాలి. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. ఈలెక్కన భారీ ఓపెనింగ్స్‌కు అవకాశం వుండదు. దీంతో క్రేజీ సినిమాలకే భారీగా నష్టపోతాయి. అలాంటప్పుడు చిన్న సినిమాల వాళ్ళు అయితే ఇక పరిస్థితి ఏంటో ? ఈ సమయంలో థియేటర్ రిలీజ్ కోసం సాయి తేజ్ సినిమా మేకర్స్ రిస్క్ చేస్తున్నాడా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: