ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అవసరం లేదు. కానీ ఈ చిత్రానికి చేయించారు. కాబట్టి.. ఈ సినిమాని కన్ఫాంగా థియేటర్లలోనే విడుదల చేస్తారని అంటున్నారు. ఈ మధ్యనే థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చనేది విశ్లేషకుల వాదన. అయితే థియేటర్స్ తెరుచుకునే అవకాశం ఇచ్చినా ఇప్పటికిప్పుడు ఓపెన్ అవుతాయన్న గ్యారెంటీ కూడా లేదు.
థియేటర్స్లోనే వస్తామని భీష్మించుకుని కూర్చుకున్న సినిమాలన్నీ ఒట్టును గట్టు మీద పెట్టేస్తూ ఓటీటీ దిశగా అడుగులేస్తున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయినా.. ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలు చాలా సమస్యలు ఫేస్ చేయాలి. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. ఈలెక్కన భారీ ఓపెనింగ్స్కు అవకాశం వుండదు. దీంతో క్రేజీ సినిమాలకే భారీగా నష్టపోతాయి. అలాంటప్పుడు చిన్న సినిమాల వాళ్ళు అయితే ఇక పరిస్థితి ఏంటో ? ఈ సమయంలో థియేటర్ రిలీజ్ కోసం సాయి తేజ్ సినిమా మేకర్స్ రిస్క్ చేస్తున్నాడా ? అనేది చూడాలి.