అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాల హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపు ముగింపు దశకు వచ్చింది. అందుకే దసరా రోజు తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశాడు నాగ చైతన్య. మనం లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన విక్రం కుమార్ డైరక్షన్ లో చైతు హీరోగా సినిమా వస్తుంది.

ఈ సినిమానౌ ఎస్.వి.సి బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పి.సి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తారని తెలుస్తుంది. సినిమాను దసరా రోజున ముహుర్తం పెట్టుకున్నారు. హర్రర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి అందిస్తుందని అంటున్నారు. తెలుగులో హర్రర్ జానర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి నాగ చైతన్య, విక్రం కుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అక్కినేని ఫ్యామిలీతో మనం.. అఖిల్ తో హలో సినిమా చేసిన విక్రం కుమార్. లాస్ట్ ఇయర్ గ్యాంగ్ లీడర్ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దిగుతున్నాడు విక్రం కుమార్. చైతుతో సినిమాకు బివిఎస్ రవి కథ అందిస్తున్నాడని తెలుస్తుంది. మరి విక్రం కుమార్ కు ఈ సినిమా అయినా హిట్టు అందిస్తుందో లేదో చూడాలి.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: