బుల్లితెర సెలబ్రిటీలు తో పాటు సినీ గాయనీ గాయకులు కూడా వచ్చి బాగా ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ ప్రోగ్రాం తాలూకా ప్రోమో కూడా విడుదలయ్యింది. అది అందర్నీ బాగా ఆకట్టేసుకుంది. దీనిలో శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.... మరో వైపు సోనూసూద్ నుంచి సాయం పొందిన దాదాపు 85 ఏళ్ల వృద్ధురాలు ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది ఇలా ఉండగా సుడిగాలి సుధీర్, ఆది, రాంప్రసాద్, రాఘవ, బుల్లెట్ భాస్కర్, సింగర్ ధనుంజయ్, మ్యూజిక్ దర్శకుడు అనూప్ రూబెన్స్ తమ టాలెంట్స్తో ప్రేక్షకులను అలరించారు. అలానే శేఖర్ మాస్టర్-రోజా డ్యాన్స్తో పాటు శేఖర్ మాస్టర్ తనయుడు విన్ని సైతం స్టేజ్పై సందడి చేశారు.
ఈ ప్రోగ్రాం లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదండి కారు, ఇల్లు, బంగారం, డబ్బు లాంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇస్తున్నట్టు ప్రోమో చూస్తే మరి అర్ధం అవుతోంది. అలానే మరో స్పెషల్ ఏమిటంటే....? కరోనా కాలం లో ఎంతో మందికి అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ వస్తున్నట్టు ప్రోమో చివర్లో చూపించారు. మరి శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా' చూడాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు 'శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా' ప్రోమో తో సరి పెట్టుకోవాల్సిందే.