మన తెలుగులో ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు చాలా వరకు కూడా ప్రయోగాలకు వేదికగా ఉంటున్నాయి. సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం లో ఇప్పుడు వచ్చే సినిమాలను కాస్త జాగ్రత్తగానే ముందుకు నడిపిస్తున్నారు. ప్రధానంగా కొంతమంది స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సినిమాల విషయంలో మాత్రం నిర్మాతలు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో దాదాపు ఇదే జరుగుతుంది.

ఈ సినిమాకు ముందు భారీగా బడ్జెట్ పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బడ్జెట్ ని భారీగా తగ్గించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట ఈ సినిమా బడ్జెట్ విషయంలో ముందు 350 కోట్ల వరకు అనుకున్నా సరే ఇప్పుడు బడ్జెట్ ని దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకూ తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ కూడా చిత్ర నిర్మాత హీరోలకు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా విడుదలైన సరే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే అవకాశం లేదని టాక్.

కాబట్టి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ ని భారీగా తగ్గించారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ల రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గినట్లుగా తెలుస్తోంది. అటు హీరోల రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక లుక్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: