తమిళ హీరో సూర్య అంటే తెలుగింట తెలియని వారు ఉండరేమో. అంతగా తన ప్రత్యేక నటనతో, హావభావాలతో డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు తమిళ తంబి. ఈ మధ్యన సూర్యనటించిన సినిమాలేవీ సరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. డైరెక్టర్స్ మారుతున్నారు, నిర్మాణ సంస్థలు మారుతున్నాయి, హీరోయిన్స్ మారుతున్నారు, ఎన్నో కొత్త కథలను పరిశీలిస్తున్నారు. కానీ ఇవేవీ సూర్య కు మంచి బ్రేక్ ఇవ్వడంలో సహాయపడలేకపోతున్నాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ సరి ఎలాగైనా హిట్ కొట్టాలని సరికొత్త కథతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు మన గజినీ సూర్య.

ఇందులో భాగంగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన త‌మిళ చిత్రం శూర‌రై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి నిర్మించారు. ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్‌ 30న ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవలన చిత్ర బృందం  నవంబర్ 12కు విడుదల తేదీని మార్చింది. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైల‌ర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో చూపించిన స‌న్నివేశాలు సినిమాపై మరింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అయితే ఇది ఒక వాస్తవ కథను ఆధారంగా చేసుకుని తెరెకెక్కింది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథను తెలియజేసిన పుస్తకం 'సింప్లి ఫై క‌ల్పిత వ‌ర్షెన్ ఆధారంగా సినిమాని తెర‌కెక్కించారు.

ప్రముఖ తెలుగు నటుడు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించారు, ఈయన పాత్ర క్లిక్ అయితే సినిమా ఓ రేంజులో ఉంటుంది. ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు ఎయిర్‌ఫోర్స్‌ ఫైలైట్‌ ఎలా అయ్యాడు మరియు తరువాత విమాన సంస్థను ప్రారంభిచాలనుకునే క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తాడు అనే నేప‌థ్యంతో సినిమాని రూపొందించిన‌ట్టు ట్రైల‌ర్‌చూస్తే అర్ధ‌మ‌వుతుంది. మరి ఇన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండగా..ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ పై ఒక లుక్కేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: