కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలో మొదటి వరుసలో ఉంటుంది పెదరాయుడు. 15 జూన్ 1995వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తెలుగునాట రికార్డుల మోత మోగించింది. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు - రజనీ కాంత్ ప్రధాన పాత్రధారులుగా, సౌందర్య - భానుప్రియ హీరోయిన్లుగా 'కోటి' సంగీత సారధ్యంలో స్వయంగా మోహన్ బాబే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన అద్భుతమైన సినిమా పెదరాయుడు.

ఇక ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. మొత్తం మోహన్ బాబు సినీ జీవితంలోనే ఈ సినిమా ఓ మైలురాయి. అయితే సేమ్ ఇలాంటి కథ, కధనంతో మరోసారి మంచు ఫ్యామిలీ బరిలో దిగబోతుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కధలో హీరో మాత్రం మోహన్ బాబు కాదు. ఇద్దరు హీరోలుగా మనోజ్ మరియు విష్ణు నటిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మోహన్ బాబు నటిస్తున్నాడనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇకపోతే అలనాటి పెదరాయుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీ కాంత్, పాపారాయుడు పాత్రలో రెచ్చిపోయాడనేది వాస్తవం. ఈ సినిమా విజయంలో ఈ పాత్ర కీలక పాత్రను పోషించిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఇదే తరహా పాత్రను మోహన్ బాబు చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే ఈ సినిమా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, ఈ సినిమా డైలాగులకు పరుచూరి సోదరులను వాడుతున్నారని తెలుస్తోంది.

నిర్మాతగా మంచు వారి వారసురాలైన మంచు లక్ష్మి బాధ్యతలు స్వీకరించనుంది. అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కాగా... విషయం తెలిసిన మంచు అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నుండి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు అభిమానులకు ఈ గాసిప్ ఒకింత ఊరటను ఇస్తోంది. ఇక ఈ సినిమా వస్తుందో లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: