మెగా ఫ్యామిలీ ఇపుడు వరసపెట్టి సినిమాలు చేస్తోంది. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా బిజీగా ఉంది. మెగా డాటర్ నీహారిక నిశ్చితార్ధం ఈ మధ్యనే జరిగింది. పెళ్ళి డిసెంబర్లో జరుగుతుందని అంటున్నరు. ఇక ఇపుడు అదే ఫ్యామిలీలో ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సాయి ధర్మ తేజ్ పెళ్లి ముచ్చట్లు కూడా అదే పనిగా సందడి చేస్తున్నాయి. తొందరలోనే పెళ్ళి పీటలు ఎక్కుతాడు అని అంటున్నారు. అయితే సాయి ధర్మతేజ్ దీని మీద తాజాగా ఒక పెద్ద క్లారిటీ ఇచ్చేశారు. పెళ్లి సంబంధాలు చూడడానికి మాత్రమే తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అంటున్నారు.

తన పెళ్ళి విషయంలో ఇది తొలి అడుగు మాత్రమేనని చెబుతున్నారు. అంతే తప్ప పెళ్ళి సంబంధం ఖాయం అయిందన్నది మాత్రం రూమర్స్ అని చెబుతున్నాడు. తాను పెళ్ళికి ఓకే చెప్పేశాను, పెద్ద వాళ్ళు పెళ్ళి కూతురిని వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్లకు పిల్ల నచ్చి తనకు నచ్చితే అపుడే పెళ్ళి అంటూ ఒక పెద్ద వివరణ ఇచ్చేశాడు.

అంటే ఇంకా క్లాప్ కొట్టాం, సినిమా షూటింగ్ కి రెడీ  చేశామని మాత్రమే సాయి ధర్మ తేజ్ వివరణ ఇచ్చాడనుకోవాలి. ఇదిలా ఉంటే సాయి ధర్మ తేజ్ కి పెళ్ళి కూతురుని పెద్దలు చూస్తారు అంటే కచ్చితంగా ఆయన ప్రేమ పెళ్ళిళ్ళకు నో చెప్పాడనే అర్ధం అంటున్నారు. ఆయనకు గతంలో హీరోయిన్లతో  లింక్ పెట్టి పుట్టించిన పుకార్లు అన్నీ వట్టివే అని దీంతో తేలిపోతోంది. ఇక సాయిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి తన భుజాల మీద వేసుకున్నారని అంటున్నారు. ఆయనే పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని టాక్.  మొత్తానికి అన్నీ అనుకూలిస్తే సాయి ధర్మ తేజ్ వచ్చే ఏడాది పీటల మీద కూర్చుంటాడని అంటున్నారు. చూడాలి మరి ఆ శుభ ఘడియలు తొందరగా రావాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారుట.






మరింత సమాచారం తెలుసుకోండి: