ఇటీవలే కాజల్ అగర్వాల్ అభిమానులందరికీ గుండెలు పగిలే వార్త చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటూ అభిమానులతో సీక్రెట్ రివీల్ చేయడంతో కాజల్ అభిమానులు ఎంతో బాధపడిపోయారు. కాజల్ స్నేహితుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని ఈ నెల 30వ తేదీన కాజల్ అగర్వాల్ వివాహం చేసుకునేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. అయితే తన స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నాను అని కాజల్ అగర్వాల్ ప్రకటించింది కానీ ఇప్పటివరకు మాత్రం తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు.
ఇలాంటి ఫోటో కోసమే అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తన అభిమానులందరికీ సర్ప్రైస్ ఇస్తూ మొదటిసారి తన కలల రాకుమారుడు తో దిగిన ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలో ఒకరినొకరు ఎంతో ప్రేమగా కౌగిలించుకున్న ట్లు గా ఉంది. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు అందరూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఈ ఫోటోపై కామెంట్ కూడా పెడుతున్నారు నెటిజన్లు.