నిర్మాత రియా కపూర్ తాజాగా మాట్లాడుతూ వీరే ది వెడ్డింగ్ సీక్వెల్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రకటించారు. కరీనా కపూర్ స్వరభాస్కర్ సోనం కపూర్, శిఖా ప్రధాన పాత్రల్లో నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రానికి శశాంక ఘోష్ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ గర్భం ధరించిన సంగతి విదితమే.

ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమా సీక్వెల్ నిదానంగా ప్రారంభిద్దామని నిర్మాతలు భావిస్తున్నారు. వీరే ది వెడ్డింగ్ మూవీ తారాగణం తోనే సినిమా తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు బాగా కోరుకుంటున్నారు. అందుకే కరీనా కపూర్ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చెనంతవరకూ వెయిట్ చేయడానికి రెడీ అయ్యారు.


సినిమా యొక్క సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం కావాలి కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఏడు నెలలు గడిచిన తర్వాత సినిమా సీక్వల్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో సినిమా బృందానికి కొంచెం ఆలస్యం అయ్యింది. కరీనా కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు. రాంజానా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన సోనం కపూర్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను దోచేశారు.


అభిమానులు కూడా ఈ సినిమా యొక్క సీక్వెల్ చూసేందుకు తపన పడుతున్నారు. లేకపోతే వీరే ది వెడ్డింగ్ సినిమాలో నలుగురు జీవితాల గురించి చూపించబడుతుంది. పెళ్లయిన తర్వాత మంచి స్నేహితులుగా ఉన్న ఆ నలుగురు జీవితాలు ఎలా మారాయి అనేది సినిమాలో చూపించబడతాయి. మరి సీక్వెల్ లో ఎటువంటి కథను చూపిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే కరీనా కపూర్ గతంలో ఒక మగ బిడ్డ జన్మించాడు. అతని పేరు తైమూర్ అలీఖాన్ కాగా.. ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: