టెలివిజన్ పరిశ్రమలో అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ అవతారం ఎత్తిన సమంత దాదాపు 3.30 గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఒక పక్కన హౌస్ మేట్స్ ని డీల్ చేస్తూనే సెలబ్రిటీలని పరిచయం చేస్తూ ఆమె రచ్చ చేసింది. మనాలిలో తన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కారణంగా, కింగ్ నాగ్ వెళ్ళగా మొన్న విజయదశమి స్పెషల్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ తెలుగు 4 కి హోస్ట్‌గా అక్కినేని సమంతను పంపారు.

ఈ కార్యక్రమాన్ని హిట్ చేయడానికి సమంతా అక్కినేని తన వంతు కృషి చేసింది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకులు మాత్రం ఈ ఎపిసోడ్ పట్ల అంత సంతోషంగా లేరు. ఈ ఎపిసోడ్ లో వేదిక మీద అక్కినేని అఖిల్, కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హైపర్ ఆది లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వచ్చి రచ్చ చేసినా ఎందుకో బిగ్ బాస్ ఫాలోవర్స్ పెద్దగా సంతోషంగా లేరు.

అలానే సోషల్ మీడియా పోల్స్ ప్రకారం కింగ్ నాగ్ సమంతా హోస్టింగ్ కంటే చాలా బాగుందని అంటున్నారు. అలానే గత ఏడాది రమ్య కృష్ణ గెస్ట్ హోస్ట్‌ గా చాలా బాగా చేశారని ఇప్పుడు ఆమె ఇప్పుడు సమంతని తెచ్చి బిగ్ బాస్ టీమ్ చాలా పెద్ద తప్పు చేసారని అంటున్నారు. అంతే కాదు విశ్వసనీయ వర్గాల ప్రకారం, టీమ్ బిగ్ బాస్ రాబోయే వారం ఎపిసోడ్ కోసం రమ్య కృష్ణ పేరును గెస్ట్ హోస్ట్‌గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ షో విషయంలో మాత్రం మామ మాట కోసమే సమంతా వచ్చినట్లు తెలుస్తోంది. మళ్ళీ రానని కూడా ఆమె చెప్పిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: