టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ ఆర్ ఆర్. బహుబలి లాంటి ఇంటర్నేషనల్ మూవీ తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ‘జక్కన్న’ తీస్తున్న మూవీ కావడంతో పాటు తెలుగు ఇండస్ట్రీకి చెందిన రెండు బడా హీరోల ఫ్యామిలీల నుండి వచ్చిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి ఎఫెక్ట్ తో టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళింది.

అంచనాలను మరింత పెంచుతూ, ఈ సినిమాలో హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్‌లను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.  రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌ను గతంలోనే యూనిట్ రిలీజ్ చేయగా, ఎన్టీఆర్ కొమురం భీం టీజర్‌ను మొన్నీమధ్యనే రిలీజ్ చేశారు.ఈ రెండు టీజర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి. అయితే దసరా కానుకగా భీం టీజర్‌ను రిలీజ్ చేసిన జక్కన్న, చరణ్‌కు సంబంధించి కూడా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తాడేమో అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూశారు.

కానీ మామూలుగానే తన సినిమాల అప్డేట్లను చాలా ఆలస్యం ఇచ్చే రాజమౌళి, మళ్ళీ చరణ్ కి సంబంధించిన అప్‌డేట్ ఏదయినా ఇవ్వాలంటే ఇంకెంత కాలం పడుతుందో చూడాలి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, తమిళ దర్శకుడు సముద్రఖని లు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలలో నటిస్తుండగా, ఆలియా భట్, ఒలివియాలు చరణ్ -ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ జక్కన్న ప్రొడక్ట్ కాబట్టి మార్కెట్ లోకి వెచ్చే దాకా డౌటే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: