రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడన్న సంగతి తెలిసిందే. ఆయన సొంత బ్యానర్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేస్తుండగానే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కించనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా కాక ఈయన డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆది పురుష్ ని కూడా లైన్ లో పెట్టాడు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఉన్న ‘ప్రభాస్’ అక్కడే యూనిట్ తో కలిసి మొన్న తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోనే కేకు కోసి ఆయన సందడి చేశారు. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి సర్‌ప్రైజ్‌ చేస్తూ ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ మొదలు ప్రభాస్ లుక్ విషయంలో ప్రభాస్ ప్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఒక షిప్ సీన్ ఉంటుందట. ఆ సీన్ ని భారీగా ప్లాన్ చేశారట మేకర్స్. మనకి షిప్ సీన్ అనగానే గుర్తు వచ్చేది టైటానిక్, ఆ సినిమాని మరపించేలా ఈ సినిమాలోని సీన్ ని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. చూడాలి ఈ సీన్ ఏమేరకు జనాల్లోకి వెళ్తుందనేది ?

మరింత సమాచారం తెలుసుకోండి: