టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నటించిన తాజా మూవీ శ్రీకారం. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు కూడా చేరుకుంది. నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వైర‌స్ వల్ల ఆగిపోయింది. ఈ చిత్రం త‌ర్వాత అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో `మహా సముద్రం` సినిమాలో న‌టించ‌నున్నాడు శర్వానంద్‌. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరోగా సిద్ధార్ధ్ కూడా నటించనున్నాడు. ఇక తాజాగా మ‌రో సినిమా కూడా దసరా నాడు మొదలు పెట్టాడు శ‌ర్వానంద్‌.

నిజానికి 2017 లోనే దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెల్ల‌లేదు. అప్పుడు రామ్ తో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తీశాడు కిశోర్ అది అంతగా ఆడలేదు ఆ త‌ర్వాత సాయి తేజ్ తో చిత్రలహరి తీసి హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ తో `రెడ్` సినిమా చేసి ఖాళీగా ఉన్నాడు.

అలాంటి సమయంలో వెంకీని కాదని ఈ సినిమాని శర్వాతో తెర‌కెక్కించడానికి రెడీ కావడం చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్‌కి, దర్శకుడు కిశోర్‌కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నారని సమాచారం. అదే కథను స్వల్ప మార్పులు చేసి శర్వానంద్ కు వినిపించ‌గా.. ఆయ‌న ఒకే చెప్పాడని అంటున్నారు. వెంకీ సినిమాని మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్‌మెహ‌న్ నిర్మించాల్సి ఉండగా శర్వా సినిమాని కొరటాల ఫ్రెండ్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: