బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలై ఆగిపోయిన ‘నర్తనశాల’ కు సంబంధించిన 16 నిమిషాల ఫుటేజీని చూసిన బాలకృష్ణ అభిమానులు తమ అసంతృప్తిని ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లవలసిన పాండవులు ఎవరెవరు ఏ వేషాలు వేసుకోవాలి ఏవిధంగా ఒక ఏడాది ఎవరి కంట పడకుండా ఉండాలి అనేది చర్చించుకోవడానికిసంబంధించిన సుధీర్ఘ సన్నివేశం తప్ప ఆ పదహారు నిమిషాల నిడివితో విడుదల చేసిన ఆ వీడియోలో బాలయ్య దర్శకత్వ ప్రతిభ కానీ బాల్లయ్య నటనా విశ్వరూపం కాని ఏది కనపడక పోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు అని తెలుస్తోంది.  


దీనితో ఈ ‘నర్తనశాల’ వీడియో క్లిప్పింగ్‍ యాడ్‍ ఫిలింకి ఎక్కువ షార్ట్ ఫిలింకి తక్కువగా ఉంది అన్న అనేక కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ వీడియొకుసంబంధించి బాలకృష్ణ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఓ మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఇస్తున్న రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. తాను  విడుదల చేసినవీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది అని చెపుతూ బాలయ్య తాను మళ్ళీ ‘నర్తనశాల’ సినిమాను తీస్తాను అంటూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శపధం చేసి తన అభిమానులకే షాక్ ఇచ్చాడు.


ఈ సినిమాలోని నాలుగు పాత్రలు అర్జునుడు బృహన్నల కీచకుడు కృష్ణుడు పాత్రలను తానే చేసే ఆలోచన ఉందని బాలయ్య ఇస్తున్న లీకులతో నందమూరి అభిమానులు కూడ భయపడుతున్నట్లు లీకులు వస్తున్నాయి. పౌరాణిక సినిమాలను చూడటం మానేసిన నేటితరం ప్రేక్షకులు ఎంతవరకు బాలయ్య ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న.  ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో బాలయ్య అనేకసార్లు మా నాన్నగారు అంటూ గతంలోకి వెళ్లిపోవడం..బృహన్నల పాత్ర కోసం చాల రీసర్చి చేసాను అని అనేక హావభావాలు పలికించిన బాలయ్య శపధం చూసి ఆయన అభిమానులు కూడ ఖంగారు పడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: