బాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల కన్నా కూడా డ్రగ్స్ వ్యవహారం జోరుగా సాగుతోంది. అంతేకాదు ఇప్పుడు కొత్తగా లైంగిక వేదింపులు అనే మాట ప్రధానంగా వినపడుతుంది. ఈ రెండు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం పై కాస్త ఎక్కువగానే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది.. కొందరు ప్రముఖుల పై దుమారం రేపే వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యింది. ఇకపోతే మహారాష్ట్ర రాజకీయాలను కూడా ఈ వ్యవహారంలోకి లాగి చిక్కుల్లో పడింది.



అంతేకాదు మహా రాష్ట్ర నుంచి బహిష్కరణ కు గురైంది. తాజాగా మరోసారి కంగనా విషయం హాట్ టాపిక్ గా మారింది.. మహారాష్ట్ర సర్కార్ ఈమె పేరును ప్రస్తావించారు. కంగనా కు మహారాష్ట్ర సర్కార్ కు మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శివసేన దసరా ర్యాలీ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ తీవ్రంగా మండిపడ్డారు.



మొన్నీ మధ్య మహారాష్ట్ర నుంచి వెల్లగొట్టడంతో బుసలు కొడుతున్న కంగనాకు ఇప్పుడు ఉద్ధవ్ అన్న మాటలు మరింతగా ఆద్యం పోశాయి..వారిపై ఉన్న కోపంతో సర్కార్ పై మాటల యుద్దం తో రెచ్చిపోయింది..నువ్వు వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చిన నొపొటిజం ప్రొడక్ట్‌వి’ అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఆగ్రహం వ్యక్తం చేసింది.నన్ను నమ్మక ద్రోహి అన్నారు..ముంబై లేకుంటే నాకు అన్నం దొరికదా అంటూ విరుచుకు పడింది..జీవితంలో పోరాడి నెగ్గిన ఒంటరి మహిళ మిమ్మల్ని ఇలా అనడం సిగ్గుగా లేదా మీరు ఏం పెద్ద మనుషులు అంటూ మండిపడింది. మీరు ఒక చెత్త లాంటోల్లు.. మీతో వాదించి నేను కూడా అలా మారాలని అనుకోవడం లేదు అంటూ ట్వీట్ చేసింది.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: