బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎనిమిదవ వారం నామినేషన్లు ముగిసాయి. మిగిలిన 11 మంది కంటెస్టంట్లలో అయిదుగురు  మినహా అంతా ప్రేక్షకుల తీర్పు కోసం ముందుకు వచ్చారు. అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, అరియానా, మెహబూబ్, లాస్య ఈ వారం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎవరిని జనం రక్షిస్తారు. ఎవరిని శిక్షిస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ఇదిలా ఉంటే గడచిన వారాల నుంచి ఆడియన్స్ తీర్పులు, బిగ్ బాస్ వారి మాటను అనుసరించి చేస్తున్న‌ ఎలిమినేషన్స్ బట్టి చూస్తే ఈ వారం కచ్చితంగా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది.

వారే అమ్మ రాజశేఖర్, అలాగే మోనాల్ గజ్జర్. నిజానికి మోనాల్ గజ్జర్ గేమ్స్ లో కానీ టాస్కులలో కానీ ఎటువంటి టాలెంట్ చూపించడం లేదని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఆమె ఎవరైనా  మాట్లాడితే ఏడుస్తూ ఉంటుంది. అది కూడా ఆడియన్స్ కి నస పెట్టేదిగా ఉందని  అంటున్నారు. దాంతో మూడవ వారం నుంచే ఆమెను ఎలిమినేట్ చేయడానికి అడియన్స్  ఓట్లు వేస్తున్నా ఆమె మాత్రం సేవ్ అవుతూనే ఉంది. దానికి బిగ్ బాస్ కారణం అని ఆడియన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం ఆమెను మళ్లీ సేవ్ చేస్తే బలి అయ్యే వారిలో మొదటిగా అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఉంటారు అంటున్నారు. ఆయన కూడా డేంజర్ జోన్ లో ఉన్నా కూడా మోనాల్ కంటే పెర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అని ఒక అభిప్రాయం ఉంది. అయితే హౌజ్ లో ఆయనకు ఇపుడు మిత్రులు లేరు అన్న మాట ఉంది. ఆయన దివితో కలసి హౌజ్ లో సందడి చేసేవారు. ఆమె వెళ్ళిపోవ‌డంతో అమ్మ రాజశేఖర్ కూడా ఈసారి ఎలిమినేట్ అవడం ఖాయం అని అంటున్నారు.

అంతే కాదు యంగ్ బ్యాచ్ మధ్యన ఆయన ఇమడలేకపోతున్నారు అన్న మాట కూడా ఉంది. రాజశేఖర్ ఏం చెప్పినా కూడా మిగిలిన వారు పట్టించుకోకపోవడం, ఆయన కోపంతో  పెద్దగా కేకలు వేయడం ఇవన్నీ హౌజ్ లో జరుగుతున్నాయి. దీంతో ఈసారి అమ్మ రాజశేఖర్ అవుట్ అన్న మాట అయితే ఉంది. మరి మోనాల్ ని ఎప్పటిమాదిరిగానే బిగ్ బాస్ సేవ్ చేస్తే మాత్రం అమ్మ రాజశేఖర్ పెట్టే బేడా సర్దేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: