అల్లు అర్జున్ పుష్ప హ్యాంగోవర్ లో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిపించేసి వచ్చే ఏడాది సమ్మర్ నాటికి థియేటర్లలో రిలీజ్ చేయించడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ఈ మూవీని పాన్ ఇండియా రేంజిలో చేస్తున్నాడు. తొలి సారి ఇండియన్ స్క్రీన్ ని  టచ్ చేయాలని కూడా అర్జున్ ఆరాటంపడుతున్నాడు. సౌత్ లో మాలీవుడ్, కోలీవుడ్ లో బాగానే మార్కెట్ ఉన్న అల్లు  అర్జున్ కి బాలీవుడ్ ని కూడా కవర్ చేయాలన్న కోరిక ఈ మూవీతో పుట్టింది. ఇది ఓవరాల్ గా పాన్ ఇండియా  మూవీకి తగిన సబ్జెట్ అని కూడా అర్జున్ నమ్ముతున్నాడు.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు నంబర్ వన్ టెక్నికల్ టీమ్  వర్క్ చేస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత సుకుమార్ చేస్తున్న కావడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇక దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే అల్లు అర్జున్ మ‌రో క్రేజీ కాంబినేషన్ కి ఓకే చెప్పాడని అంటున్నారు.

విలక్షణ దర్శకుడు కొరటాల శివతో కొత్త మూవీకి బన్నీ పచ్చ జెండా ఊపేశాడు. శివ ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ ని సరికొత్త కోణంలో చూపించేందుకు శివ తాపత్రయపడుతున్నాడు. ఈ మూవీ తరువాత శివ చేసేది బన్నీ మూవీ. దాంతో బన్నీ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసి పెట్టాడని అంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ తరువాత పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ విషయం ఇపుడు హాట్  డిస్కషన్ గా ఉందిట‌.

అల్లు అర్జున్ అయితే తన ఓటుని కీర్తి సురేష్ కి వేశాడని అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టంట్. దాంతో కీర్తి అయితే బాగుంటుందని బన్నీ అన్నాడని టాక్. మరి ఆయనని మెప్పించిన మహానటి కచ్చితంగా ఈ మువీలో ఫిమేల్ లీడ్ రోల్ కి ఓకే చెబుతుందని అంటున్నారు. ఇప్పటికే సర్కార్ వారి పాటలో మహేష్ సరసన నటిస్తున్న కీర్తి తమ ఇమేజ్ ని మార్చుకునే పనిలో పడింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు కమర్షియల్  మూవీస్ కి కూడా ఆమె ఓకే చెబుతూండడంతో కొరటాల శివ, బన్నీ కాంబోలో వచ్చే కొత్త మూవీకి ఆమె హీరోయిన్ అంటున్నారుట. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: