తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసి ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్‌ సాబ్‌' సినిమా సెట్స్‌పై ఉండగా.. త్వరలోనే క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒకటి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నట్లు ఆయన అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతూ దసరా కానుకగా ఆయన మరో సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పవన్ ‌కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు. యువ దర్శకుడు సాగర్‌చంద్ర నిర్ధేశక బాధ్యతల్ని చేపడుతున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' చిత్రానికి రీమేక్‌ ఇదని సమాచారం. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు పవన్‌కల్యాణ్‌.

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌' తర్వాత ఆయన మరోమారు పోలీస్‌ పాత్రను పోషిస్తుండటం విశేషం. పవన్‌కల్యాణ్‌తో మా సంస్థకిది తొలిచిత్రం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాం. అన్యాయాన్ని ఏమాత్రం సహించని పోలీస్‌ అధికారిగా పవన్‌కల్యాణ్‌ పాత్ర శక్తివంతంగా సాగుతుంది. అభిమానుల్ని అలరించే అన్ని అంశాలున్న కథాంశమిది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: తమన్‌, ఎడిటర్‌: నవీన్‌నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, దర్శకత్వం సాగర్‌ కె చంద్ర. పవన్ ఇమేజ్ రెట్టింపు చేసేలా.. ''కింగ్ ఆఫ్‌ ఆట్యిట్యూడ్‌. .. తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మీ ముందుకు రాబోతున్నారు'' అని ప్రకటించారు దర్శకనిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: