సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు నటించగా....విజయదశమి పండుగ కానుకగా ఈ చిత్రం లో ఏడు సూపర్హిట్ సాంగ్స్ వీగా మ్యూజిక్ ద్వారా చేయగా... నటి సీత, కెమెరామెన్ విజయ్ టి, దర్శకుడు కె.ఎం.ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో భద్రకాళి గా సీత నటిస్తున్నారు. రౌద్రం తో కూడిన భద్రకాళిగా వేయడం ఇదే తొలిసారి అని నటి సీత చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు డిజిటల్ మూవీస్ వచ్చేశాయి అత్యుత్తమ సాంకేతిక విలువలతో కూడిన చిత్రాలను రూపొందించడానికి అవకాశం వుంది అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం ఉన్న టెక్నాలిజీ తో దీనిని రూపొందించడం జరిగినదన్నారు. అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రెడీ చేసాము. సీత గారు ఆ పాత్రలో అమ్మవారుగా ఒదిగిపోయారు అని దర్శకుడు కె . ఏం . ఆనంద్ చెప్పారు. ఏ జోనర్ లో వున్నా సినిమాలకు సంగీతం ముఖ్యం అవి ఎవర్ గ్రీన్ గా ఉండాలి అందుకోసం ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేసాము అని నిర్మాత చిక్కవరపు రాంబాబు చెప్పారు. ఈ రోజు వీగా మ్యూజిక్ ద్వారా విజయదశమి రోజున అమ్మవారు భద్రకాళి అశ్విర్వాదంతో విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు.