అవసరాల శ్రీనివాస్ రొమాంటిక్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తోంది తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాకి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. గోల్కొండ హై స్కూల్ కి డైలాగులు రాశారు. జో అచ్యుతానంద సినిమాకి డైలాగులు రాసినందుకుగాను శ్రీనివాస అవసరాలకు గోల్డెన్ నంది బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు లభించింది. ఈ విధంగా ఒక దర్శకుడిగా నటుడిగా స్క్రీన్ రైటర్ గా అవసరాల శ్రీనివాస్ సినీ రంగంలో దూసుకెళ్తున్నారు. 2008వ సంవత్సరంలో హీరో నాని తో కలిసి అష్టాచెమ్మా సినిమా లో శ్రీనివాస్ అవసరాల నటించారు. మళ్లీ ఇప్పుడు అతనితో కలసి ఓ సినిమా చేయాలని అవసరాల శ్రీనివాస్ అనుకున్నారట. కానీ ఈ సారి దర్శకత్వం వహించాలని ప్లాన్ చేసుకున్నారు.


ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య తో కలిసి ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే హీరో నాని కోసం ఒక మంచి కథను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ సినిమాల్లో డీసెంట్ కామెడీ ఉంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమా లో అవసరాల శ్రీనివాస్ యొక్క రచన ప్రతిభా అందరికీ తెలిసిందే. మళ్లీ అటువంటి మంచి కామెడీతో హీరో నాని తో ఒక సినిమాని తీయాలని అవసరాల శ్రీనివాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. హీరో నానికి, అవసరాల శ్రీనివాస్ కి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అలాగే అవసరాల శ్రీనివాస్ మంచి ప్రతిభావంతుడు కాబట్టి హీరో నాని అతనితో కలిసి సినిమా తీయడానికి సిద్ధమవుతున్నట్టు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలున్నాయి. అవి పూర్తయ్యేలోపు అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య తో తన సినిమాని ముగిస్తారని తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ చాలా సమయం తీసుకొని మంచి సినిమాలు తెరకెక్కిస్తారు. అయితే నాగ శౌర్య తన సినిమాని పూర్తి చేసే లోపు నాని తన మూడు సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: