బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా సరే దిశా పటాని కాస్త హాట్ టాపిక్ గా ఉంటుంది. ఆమె అందాల ఆరబోత విషయంలో ముందు నుంచి కూడా చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. యువతలో కూడా ఆమెకు చాలా మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా ఆమె సినిమాల్లోకి తీసుకోవడానికి ఆసక్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం ఆమెకు కొంత మంది స్టార్ దర్శకనిర్మాతలు ఆమెను పక్కన పెడుతూ వస్తున్నారు.

అయితే మన తెలుగులో కూడా ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ఎప్పుడో వరుణ్ తేజ్ సినిమాలో ఆమె కనబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే ఆమె  అల్లు అర్జున్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా ఆమె ఐటం సాంగ్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఈ సినిమాలో విలన్ కూతురు కూడా ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా లో ఎంత మంది హీరోయిన్లు నటిస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే హీరోయిన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇప్పటికే కీర్తి సురేష్ ని ఈ సినిమాలో ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటుగా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశాలు ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: