టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే . ఇటీవలే అల వైకుంఠ పురములో  అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అల్లు  అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తో  ముచ్చటగా మూడోసారి జోడీ కడుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతుంది సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. స్మగ్లింగ్  నేపథ్యంలో సాగే ఈ సినిమా లో  అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటించ పోతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.




 అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజుల వరకు షూటింగ్ నిలిచిపోవడంతో విశ్రాంతి తీసుకున్నా పుష్ప చిత్రబృందం.. త్వరలో మళ్లీ పట్టాలెక్కపోతున్నట్లు  తెలుస్తోంది. అడవుల్లో పలు కీలక ఫైట్ లకు సంబంధించిన చిత్రీకరణలు మొదట పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నారు.



 మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా మొదటిసారి నటిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న టాక్ వినిపిస్తోంది. కేరళ లేదా మారేడుపల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కాగా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్లను  తెరకెక్కించేందుకు  చిత్రబృందం భావిస్తోందట. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా అటు ప్రేక్షకుల్లో  రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: