ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... రీమేక్ సినిమాలు చాలా మందిని స్టార్ హీరోలను చేశాయి. కాని పదే పదే రీమేక్ లు చేస్తూ పోతే అభిమానులకు నచ్చదు. రీమేక్ లు పదే పదే చెయ్యటం వలన ఆ స్టార్ హీరోస్ కి తమ అభిమానుల పట్ల కొంచెం విలువ తగ్గుతుంది. ఇక విషయానికి వస్తే మన టాలీవుడ్ స్ట్రాంగ్ పిల్లర్స్ మెగాబ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మెగాభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. దానికి కారణం చిరు, పవన్ పోటీ పడి మరీ రీమేక్ కథలను ఓకే చెబుతుండడమే.

ఇక చూసుకున్నట్లయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోషియుం’ రీమేక్ లో నటించబోతున్నారనే విషయం బయటకి వచ్చింది. ముందు ఈ సినిమాలో హీరోగా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ని ఫిక్స్ చేశారు.‘అప్పట్లో ఒకడుండేవాడు’ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా మళయాలంలో సూపర్ హిట్ అని తెలియగానే.. తెలుగు ప్రేక్షకులు కూడా పడి పడి చూశారు. ఇది తెలుగులో కమర్షియల్ గా వర్కవుట్ అవ్వదనీ.. పవన్ కి తగ్గ ఎలివేషన్ ఉన్న సినిమా కాదనీ వాదిస్తున్నారు.


మరో విషయం ఏమిటంటే.. నిజానికి పవన్ ‘పింక్’ రీమేక్ ఎన్నుకున్న సమయంలో కూడా కొంత వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు మరోసారి రీమేక్ కథను ఎన్నుకోవడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు అభిమానులు.రీమేక్ అంటే సినిమాపై ఎగ్జైట్మెంట్ ఉండదని.. తమ బాధను చెప్పుకుంటున్నారు. మరోపక్క చిరంజీవి కూడా ‘ఆచార్య’ సినిమా తరువాత వరుసగా.. ‘లూసిఫర్’, ‘వేదాళం’ లాంటి మాస్ మసాలా సినిమాల రీమేక్ లను లైన్లో పెట్టడం కూడా అభిమానులను బాధిస్తోంది. మరి వీరి బాధ హీరోలకు అర్ధమవుతుందో లేదో చూడాలి... ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మూవీస్ అప్డేట్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: